Is Nature Facing Threat From Human Beings | Idi Sangathi
У вашего броузера проблема в совместимости с HTML5
భూ గోళం మూడొంతులు నీటితో నిండి ఉంది. మిగతా భాగంలో మాత్రమే జీవజాతి మనుగడ సాగిస్తోంది. ఐతే ఉన్న ఈ కొద్దిపాటి భూమిపై ఉన్న మనిషి భూమండలానికే ప్రమాదకరంగా మారాడు. అభివృద్ధి పేరిట సమస్త ప్రకృతిని ధ్వంసం చేస్తున్నాడు. అవసరాల కోసం... తన మనుగ డ కోసం చెరువులు, నదులు... ఆఖరికి సముద్రాలనూ కాటేస్తున్నాడు. ఆధునికత పేరిట పంచ భూతాలకు పొగబెడుతున్నాడు. ఇప్పటికే వాయు కాలుష్యంతో మరణశాసనం లిఖించుకున్నా తీరు మార్చుకోక... సముద్రాలనూ వదలడం లేదు. విచ్చలవిడిగా వ్యర్థాలను వదులుతూ సాగర జలాలకు.. అందులోని జీవకోటి మనుగడమే ముప్పు తెస్తున్నాడు. ఇందులో ప్రధానంగా ప్లాస్టిక్ వ్యర్థాల మూలంగానే సముద్ర జలాలు అత్యంత విషతుల్యంగా మారిపోతున్నాయి. ఇటీవల నార్వే సముద్ర తీరంలో ఇటీవల జరిగిన ఘటన ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. ప్లాస్టిక్ వ్యర్థాలు తినడం వల్లే తీరానికి కొట్టుకొచ్చిన తిమింగలం మరణించిందని తేలడం సముద్రాలు ఎంతలా కాలుష్యం బారిన పడ్డాయో అర్థం చేసుకోవచ్చు. ఈక్రమంలోనే ఇటీవల చెన్నై తీరంలో 2నౌకలు ఢీకొనడం వల్ల అందులోని చమురు ఒలికి సముద్ర జీవులపైనా, అక్కడి వాతావరణంపైనా పెను ప్రభావాన్నే చూపుతోంది. ఇలా ప్రపంచ వ్యాప్తంగా దాదాపుగా ఇదే తరహా పరిస్థితి నెలకొంటోంది. మనిషి స్వీయ తప్పిదాల వల్ల పర్యావరణానికి చేటు తెస్తున్నాడు.
----------------------------------------------------------------------------------------------
☛ Download ETV Android App: https://goo.gl/aub2D9
For Latest Updates on ETV Channels !!
☛ Visit our Official Website: http://www.etv.co.in
☛ Subscribe to Latest News -https://goo.gl/9Waw1K
☛ Subscribe to our YouTube Channel - http://bit.ly/JGOsxY
☛ Like us : https://www.facebook.com/ETVAndhraPradesh
☛ Follow us : https://twitter.com/etvandhraprades
☛ Circle us : https://goo.gl/H5cc6E
----------------------------------------------------------------------------------------------